haaram logo

Monday, July 24, 2017

అవినీతీ......

"ద్రోహులు......ఊలిపికట్టెలు.....కాంగీలు......"


అసలు ఆ పరప్పన్న ఎవరో, ఆయనకి ఏ రాజుగారు అగ్రహారం ఇచ్చాడో, అందులో అంత పెద్ద భవనం ఎందుకు కట్టారో, దాన్ని జైలు గా ఎందుకు మార్చారో.....నాకు తెలీదు గానీ, అది తరచూ వార్తల్లో ఉంటుంది!

మొన్న దక్షిణభారత అవినీతి మహారాఙ్ఞి గారి నెచ్చెలి కి, ఆ జైల్లో ఓ అంతస్తు మొత్తం, అందులో 5 గదులూ, సకల సౌకర్యాలూ--2 కోట్లు మాత్రమే తీసుకొని మరీ, ఒకాయన కేటాయించారని ఓ జైళ్ల ఉన్నతాధికారిణి పై అధికారికి ఫిర్యాదు చేస్తే, ముఖ్య మంత్రి గారు "క్రమశిక్షణ ఉల్లంఘించావు" అంటూ ఆమెనే బదిలీ చేసి పారేశారు.

పైగా, ఆ జైళ్ల పై అధికారి, జైలుకి వెళ్లి, ఖైదీలతో ఆ అధికారిణికి వ్యతిరేకంగా "ఆందోళన" చేయించారట!

అసలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న--ముఖ్యమంత్రులకీ, ఆ జైళ్ల పై అధికారులకీ, 2 కోట్ల అధికారికీ శిక్షలు ఏమిటో......ఎప్పుడో......?

అయినా, ఆ రాణిగారిదీ, ఆవిడ నెచ్చెలిదీ తప్పేముందిలెండి! ధనాన్ని సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించాలి, ఇంకొందరికి పంచాలి--అని ప్రవచనకారులు చెప్పే మాటలని తు చ తప్పకుండా ఆచరించడమేగా వాళ్లు చేసింది, చేస్తున్నది!

No comments:

Post a Comment