haaram logo

Tuesday, August 23, 2016

గో వధలూ.....గొడవలూ.....

గో సంరక్షణ.....

ఈ మధ్య, గోరక్షకులూ....దళితులూ....అంటూ అనవసర సమస్యలు సృష్టించడానికి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కానీ, అడుసుమిల్లి సూర్య ప్రకాశ్ లాంటి వాళ్లు కూడా, "ఉప్పలగుప్తం లో.....గో రక్షకులు...." అంటూ వ్రాస్తుంటే, నవ్వాలో యేడవాలో తెలీడం లేదు!

స్వామీ దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10 న బొంబాయి లో "ఆర్య సమాజ్" ను స్థాపించారు.

(ఇప్పుడు అనేకమంది దయానందులూ, సరస్వతులూ అనేక చెత్త మఠాలూ అవీ నడుపుతున్నారు. ఆయనెవరో ....ఆనంద సరస్వతి, ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం యాగం చేసి, కిరస్థానీ జగన్ చేత హోమం చేయించి, పూర్ణాహుతి ఇప్పించాడు).

ఆయనే, 1882 లో, "గోరక్ష" ఉద్యమాన్ని చేపట్టారు. అప్పటినుంచీ, మనదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, గో సంరక్షణ సమితులు కొనసాగుతున్నాయి. వాటికి యే ప్రభుత్వ లేదా మత సంస్థలతోనూ సంబంధం లేదు. ఆ సభ్యులకి ఎవరూ జీతాలూ గట్రా ఇవ్వరు.

ముఖ్యంగా వాటి ఉద్దేశ్యం.....వట్టిపోయిన, ముసలివైపోయిన ఆవులనీ, ఆబోతులనీ కబేళాలకి పంపించకుండా, సంరక్షించడం. జీవ కారుణ్యానికి చక్కని ఉదాహరణ ఇది.

ఇప్పుడు అనేకమంది సాధువులూ వగైరాలు గోశాలలూ, సంరక్షణాలయాలూ నడిపిస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న అనేక వందల పశువులని పోలీసుల సహాయంతో పట్టుకొని, గోశాలలకి తరలించిన సంఘటనలు గత కొన్ని సంవత్సరాలలో అనేకం జరిగాయి. పత్రికలు వ్రాస్తూనే ఉన్నాయి. మరి ఆ అక్రమార్కులకి యేమైనా శిక్షలు పడ్డాయో లేదో, ఆ పత్రికలు ఇంక పట్టించుకోవు.

అసలు ఉప్పలగుప్తం సంఘటన యేమిటి? గుజరాత్ లోనూ, యూపీ, బీహార్లలోనూ జరిగినవి ఏమిటి? వాటికి మీడియా పూసిన రంగులు యేమిటి?

(.....ఇప్పటికి ఇంతే)