haaram logo

Friday, March 9, 2012

దేశానికి దరిద్రం.......



.......యెప్పటికి వదిలేనో?

సగం దరిద్రం వదిలింది. 5 రాష్ట్రాల్లో, ఒక్క వేలెడంతకూడా లేని ఓ రాష్ట్రంలో మాత్రమే అధికారం మళ్లీ దక్కింది కాంగీలకి.

ఇంక రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోతే బాగుండును--యే 2034 వరకో--అప్పటికి కాస్త సీనియారిటీ వస్తుంది!

రేపు మనరాష్ట్ర వుపయెన్నికల్లో కాంగీలూ, తెరాసాలూ పోతే, ఇంకో పావు వంతు దరిద్రం తీరుతుంది.

మిగితా పావు, 2014 లో చూద్దాం!

కానీ, వోటర్లూ, అవినీతి ములాయం ప్రథాని అవ్వాలనీ, తాను ముఖ్యమంత్రి అవ్వాలనీ అఖిలేష్ లాంటివాళ్లు చేస్తున్న రాజకీయాల విషయం లో జాగ్రత్త వహించండి!

సోనియా మాత్రం, రెట్టించిన వుత్సాహంతో, కొన్ని లక్షల కోట్ల "ఖర్చు" కాగల పథకాలమీద పథకాలని వదుల్తోంది! అదేదో జాతీయ సలహా మండలి కి ఆవిడ కుర్చీమనిషో యేదో అనుకుంటా! 

తాజాగా 20 కోట్ల కుటుంబాలకి ఆరోగ్య అదేదో పథకంట. మరణం, అంగవైకల్య బీమా, గర్భిణులకు ఆర్థిక సాయం, ఆరోగ్య బీమా, పింఛన్లూ ఇస్తారట.

బీమా ప్రీమియం యెవరు కడతారు? ఇంకెవరు--ప్రభుత్వమే! 

ముఖ్యంగా, 20 కోట్ల కుటుంబాల్లో, స్త్రీలు గర్భిణులుగా వుంటే, ఒక్కొక్కరికీ నెలకి వెయ్యి రూపాయల చొప్పున, ఓ ఆరునెలలపాటు చెల్లిస్తారట! (యేడాదిలో "దీనికే" యెన్ని కోట్లవుతుందంటారు?)

పాపం.....మన్మోహనూ, ఇతర మంత్రులూ ఓ తడికలాంటి అటకమీద ఒకళ్లమీద ఒకళ్లు పడివున్నారు--క్రింద ప్రణబ్ తో--మధ్యలో యెక్కడో వీళ్లమీద రహస్య గూఢచర్యం సాగిస్తున్న పిచ్చిదంబరం తో! మన్మోహన్ అప్పుడప్పుడూ తన తలపాగాలోంచి ఓ కుందేలునో, పిల్లినో తీస్తూంటాడు--చిల్లర వ్యాపారంలో ఎఫ్ డీ ఐ; జోక్ పాల్; అదేదో జాతీయ భద్రతా దళం--అంటూ! వెంటనే, క్రిందనుంచి కమ్యూనిస్టులూ, అన్నా హజారేలూ, ప్రతిపక్షాలూ పొడుస్తారు!

ఈలోపల పైనుంచి ఇలాంటి బండలు వేస్తూంటుంది సోనియా! 

మన్మోహన్--"ఒక్క క్షణం......ఒక్క క్షణం......మోయలేని ఈ హాయిని మోయనీ!" అని పరవశిస్తూంటే, పాపం ప్రణబ్......"నీ హాయి మండా! నీకేం? పదవిలో వున్నావు! యేమీ లేకుండా, ఇంత గాడిద బరువు యెలా మొయ్యాలా అని నాకు నిద్రకూడా పట్టడంలేదురా బాబూ!!!!!" అంటూ మొత్తుకుంటున్నాడు.

ఈ దేశం, ఈ ప్రభుత్వం యెటు వెళుతున్నాయో? 

వాటికి దిశానిర్దేశం (పాతాళం లోకి) చెయ్యడానికి సిధ్ధపడుతున్నారా?

ఓకే!

శుభమస్తు!