haaram logo

Monday, April 21, 2014

సమాచార హక్కు


సిగ్గులేని నాయకత్వం 

మన రాష్ట్రం లో స హ చట్టం ప్రకారం దరఖాస్తులకి తెలుగులోనే సమాధానం ఇవ్వాలి.....సమాచారం ఆంగ్లం లో వుంటే అనువదించి మరీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు.

కానీ, రాయలసీమ విశ్వవిద్యాలయానికి సంబంధించి దరఖాస్తు చేస్తే, సమాచారం 70 వేల పేజీలు వుంది అనీ, పేజీ కి రూ. 2/- చొ.న. ఓ లక్షా నలభైవేలూ, అనువాదానికి ఖర్చులుగా రూ. 2 లక్షల పది వేలూ, వెరసి మూడున్నర లక్షలిస్తే సమాధానం ఇస్తామన్నారట అధికారులు.

నడివీధిలో కొరడాదెబ్బలు కొట్టాలని శిక్ష వేయద్దూ వాళ్లకి?

పార్లమెంటు లో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయా శాఖల మంత్రులు, చర్య తీసుకుంటామని ఇచ్చిన హామీలని నిర్దిష్ట గదువులోగా నెరవేర్చాలి. అవి నెరవేరేలా చూడ్దానికి ఓ సభాసంఘం వుంటుంది. కానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అలాంటి హామీలు 2,812 బుట్టదాఖలు చేశారట. ఇంకో 299 మాటలను వెనక్కి తీసుకున్నారట!

ఈ ప్రభుత్వ పార్టీ యేమో, 2004, 2009 యెన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ కాకపోయినా, అత్యధికం నెరవేర్చాం అంటు సిగ్గులేకుండా డబ్బా కొట్టుకొంటోంది!

సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రమేయం వుందనే ఆరోపణలున్న ఓ భూకుంభకోణం పై సమాచారం అడిగితే, ప్రథానమంత్రి కార్యాలయం యేకంగా గుండెలు బాదేసుకుందట--సమాచారం అడగడం చట్ట విరుధ్ధం; చట్టాన్ని దుర్వినియోగ పరచడం; చట్టాన్ని అపహాస్యం చెయ్యడం--అంటూ!

పెద్దింటి అల్లుడి గురించి అడగడం మాహా పాపం అన్నట్టు తేల్చారట.....పీ ఎం ఓ ఉపకార్యదర్శి తన 15 పేజీల లేఖలో!

సమాచార హక్కు చట్టం మేమే తెచ్చాము అన్న వెయ్యేళ్లు ధనంతో వర్థిల్లాలి అనుకొనేవాడు ముఖం యెక్కడ పెట్టుకోవాలో మరి?

మూడేళ్ల క్రితం, ఒత్తిడి పెరుగుతూండడంతో, కేంద్ర ప్రభుత్వం దేశ విదేశాల్లో మన వాళ్ల నల్లధనం యెంతో తేల్చమని మూడు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలని ఆదేశించి, 18 నెలల గడువు ఇచ్చిందట.

ఆ విషయం లో యేం జరిగింది అని స హ దరఖాస్తు చేస్తే, ఒక్క సంస్థ మాత్రమే నివేదిక ఇచ్చింది అనీ, దాన్ని పరిశీ........లించి, చర్యలు తీసుకోవాలి కాబట్టి, ఆ నివేదిక నకలు ఇవ్వలేము అనీ చెప్పారట అధికారులు. మిగిలిన రెండు సంస్థలూ ఇంకా యెన్నాళ్లు గోళ్లు కొరుక్కుంటూ వుంటాయో?

అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నది మా ప్రభుత్వం మాత్రమే అంటూ స్వకుచమర్దనం చేసుకుంటున్న వె ధ వ ..............?!

మొదణ్నించీ చెపుతున్నాను ఆథార్ పెద్ద కుంభకోణం అని.......

నందన్‌ నీలేకణి ని ఆథార్ ఛైర్మన్‌ గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతి, ఆయన రాజీనామా పత్రం నకలు, ఆయన పదవిలో వున్నప్పుడు ప్రథానమంత్రి కార్యాలయం తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ప్రతులను అడుగుతూ సహ దరఖాస్తు చేస్తే, దాన్ని సెక్షన్‌ 6 (3) క్రింద యెన్నికల సంఘానికి బదిలీ చేశారట!

గోకులాష్టమికీ, పీరు సాయిబ్బుకీ సంబంధం యేమిటో మరి!

ఇలాంటివన్నీ బయట పెడితే, అసలు రహస్యాలు బయటపడతాయని భయపడుతున్నారు అని తేట తెల్లం అవడం లేదూ?

ఇంక స హ చట్టం తెచ్చింది మేమే అని బుకాయించడం మానేస్తారా......వె ధ వ లు?

గత పదేళ్లలో ప్రథాని 1110 సార్లు నోరు విప్పారని చెప్పారట....అంటే నెలకో పది సార్లకన్నా తక్కువే! ఆ సందర్భాలు కూడా విదేశాల్లోనో, ఇంకెక్కడో అగ్రరాజ్యాలని దేబిరించడం, తనేదో అంతరిక్ష రాజ్యానికి అధిపతినన్నట్టు....... ప్రభుత్వం ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి......అని చెప్పడానికేనమ్మా! మహగొప్ప నికమ్మా!

అదే 2009-14--ఐదేళ్లలో, స్పీకర్ మీరా కుమార్ (1977 లోఇందిరాగాంధీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి, "సింహాసనం అదిరింది" అని ప్రకటించిన మహానుభావుడు బాబూ జగజ్జీవనరామ్ కుమార్తె ఈమె) తన తండ్రీ, తన నియోజకవర్గం బీహార్ లోని ససారమ్‌ లో కేవలం 58 రోజులు మాత్రమే గడిపారట.

దాహంతో గొంతెండిపోయే ప్రజలకి చేసిందేమీ లేదుగానీ, అదే సమయం లో 178 రోజులు విదేశాల్లో వున్నారట! (ఇవీ స హ చట్టం ప్రకారం బయటకి వచ్చినవే!)

మరి ఆ ప్రజలు మళ్లీ ఆవిడకి ఓట్లు వేస్తారంటారా?