haaram logo

Tuesday, January 14, 2014

నేటి జర్నలిజం


వార్తలూ, విశేషాలూ

13-01-2014, ఈనాడు జిల్లా ఎడిషన్ లో, శాస్త్రవేత్త ఎ.సూర్యతేజ్ "......తన అనుభవాలను..... పంచుకున్నారు...... ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే......." అంటూ.......

"జీ ఎస్ ఎల్ వీ-డీ5.......ప్రయోగంలో 'లిక్విడ్ ఇంజిన్ మెకానికల్ సిస్టం 'పై పనిచేసి........గర్వకారణం....... గతంలో పీ ఎస్ ఎల్ వీ ప్రయోగం ద్వారా 1.6 టన్నుల క్రయోజెనిక్ ఇంజిన్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీ ఎస్ ఎల్ వీ-డీ5 ప్రయోగం ద్వారా దాదాపు 2 టన్నుల బరువుతో కూడిన క్రయోజెనిక్ ఇంజిన్ ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం ద్వారా.......ఘన విజయమనే చెప్పాలి"

అని ప్రచురించారు. (అండర్ లైన్ చేసింది నేను)

మరి ఆ విలేకరే అలా వ్రాశాడో, సబ్ ఎడిటర్ పట్టించుకోలేదో! ఇంకా ఇలాంటివాళ్లని యెన్నాళ్లు భరిస్తారో?
     
అసలే జర్నలిస్టులూ, సబ్ ఎడిటర్లూ దొరక్క మేమేడుస్తూంటే ఈ గోల యేమిటీ అంటారేమో!