haaram logo

Tuesday, August 4, 2015

న్యాయ ద్రోహులు

"లయ్యర్లూ", 'అ' న్యాయమూర్తులూ......2

అసలు ఇలాంటి కేసులన్నీ ఆ 'కొందరే' యెందుకు "గుత్తకు" తీసుకొంటూ వుంటారు? అలా ఇంకెన్నాళ్లు తీసుకుంటారు? వాళ్ల తరవాత తరం వాళ్లూ, వాళ్లకన్నా ఇంకా జూనియర్లూ మరెప్పుడు వాళ్ల ప్రతిభ ని వెలికి తీసుకు రాగలరు? వాళ్లకి రిటైర్మెంటు లేదా? 

జడ్జీలుగా రిటైర్ అయినవాళ్లు కూడా మళ్లీ గౌన్లు తగిలించుకుని, కేసులు వాదించొచ్చు! (ఇలాంటి వాటి వల్లే "నాట్ బిఫోర్" లు యెక్కువైపోతున్నాయి). కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగులో వుంటున్నాయి. నెలకి కనీసం ఓ 50 "పిల్" లో, "సువో మోటో" లో స్వీకరిస్తున్నారు. 

క్రింది కోర్టు స్టే ఇవ్వడమో, బెయిల్ ఇవ్వడమో, నిరాకరించడమో జరగ్గానే, వెంటనే పై కోర్టుల్లో అప్పీళ్లు దాఖలూ.....వాటి పై విచారణలూ, అదలా వుండగానే, ఇంకొకళ్లు హై కోర్టుకీ, ఇంకొకళ్లు సుప్రీం కీ......!

అవి చాలవన్నట్టు, ప్రతీ చిన్న విషయానికీ, సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలనేవాడే ప్రతీ వె.ధ.వ కూడా! ఇంకా అనేక కమిషన్లకీ, సంఘాలకీ......రిటైర్డ్ సీనియర్ న్యాయమూర్తులే! ఇంకా కొన్ని కార్పొరేషన్ల లాంటి వాటికీ, వాళ్లనే నియామకం!

పోనీ జూనియర్లకి ప్రతిభ తక్కువా? వీళ్లకి యెన్నో విధాలుగా కష్టపడి సమాచారాన్నీ, ఇతర ముఖ్యమైన పాయింట్లనీ తయారు చేసి ఇచ్చేది ఈ జూనియర్లే! ఈ జూనియర్లేమైనా బాగా సంపాదించుకుంటున్నారా? యే కోర్టులోనైనా, వేళ్లమీద లెఖ్ఖ పెట్టదగ్గవాళ్లు తప్ప, మిగిలిన వాళ్లందరూ చెట్టు క్రిందే......! కొత్తగా ఎన్ రోల్ అవుతున్నవాళ్లు అవుతూనే వున్నారు!

మరి యెంతకాలం ఇలా సాగాలీ? పరిష్కారాలు యేమైనా వున్నాయా? సంస్కరణలు యేమైనా వీలవుతాయా?

చూద్దాం! 

(.......మరోసారి)

Monday, August 3, 2015

న్యాయ ద్రోహులు

"లయ్యర్లూ", 'అ 'న్యాయమూర్తులూ......

మన పెద్దవాళ్లెప్పుడో చెప్పారు.....లాయర్లు అంటే లయ్యర్లు అని. ఇంకా, ఓడినవాడు కోర్టులోనే యేడిస్తే, గెలిచినవాడు ఇంటికెళ్లి యేడిచాడు అనీ, ఇంకా.....తెల్ల కోటునీ, నల్లకోటునీ ఒక సారి ఆశ్రయిస్తే జీవితాంతం వదలరు అనీ......ఇలా బోళ్లు ఛలోక్తులు!

(ఇలాంటి వాళ్లకి, గాంధీజీ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి అతి కొద్ది మందే మినహాయింపు.) 

ఇప్పటి వ్యవహారాలు చూస్తే, అవన్నీ నిజం అనిపించడం లేదూ?

ఒకప్పుడు చిన్నారుల్ని చిదిమేసిన "బిల్లా, రంగా" కేసు నుంచీ, అమ్మాయిని "తందూరీ" లో దహనం కేసు నుంచీ, పెళ్లాన్ని చంపేసిన ఓ "మంత్రి" కేసు నుంచీ, మొన్నటి "నిర్భయ" కేసు నుంచీ, "సంజయ్ దత్", "సల్మాన్" కేసులనుంచీ, "గాలి" జనర్దన రెడ్డి కేసుల నుంచి, "జగన్" కేసుల నుంచి, "జయలలిథా" ఆస్థుల కేసుల నుంచి, నిన్నటి "యాకూబ్ మెమెన్" కేసుల వరకూ మనకి కనిపిస్తున్నదేమిటి?

ఆ నేరస్థుల కి శిక్ష పడకుండా చేయాలని, పడినా యెలాగోలాగ తప్పించాలని, ఉరి శిక్ష పడ్డా, దాన్ని కొన్ని సంవత్సరాలో, నెలలో, వారాలో, రోజులో వాయిదా యేయించాలనీ, కోర్టుల్లోనూ, బయటా, నానా విన్యాసాలూ చేసి, నానా గడ్డీ కరిచి, కరిపించి, తమ కండూతి తీర్చుకుంటున్న "రామ్ జేఠ్మలానీ" లాంటి వాళ్లు అనేకమంది వున్నారు, కర్నాటక స్పెషల్ కోర్టు న్యాయమూర్తిలాంటి వాళ్లు వున్నారు......అని కాదూ?

వాళ్లకి అంత కండూతి యెందుకు? అంటే రెండే కారణాలు.....1. కోట్లలో డబ్బు ముడుతూంది, 2. కావలసినంత ప్రచారం జరిగి, అలాంటి కేసులన్నీ వాళ్లకే వెళుతున్నాయి!

మరి న్యాయం యెక్కడున్నట్టు? A I R (న్యాయాలయాల తీర్పులన్నీ ప్రచురించే పుస్తకాలు) లలో!

వాటి మీదే ఈ పరాన్న భుక్కుల జీవనం మరి!

(.......మరోసారి)

Saturday, August 1, 2015

తీవ్రవాదులు....తీవ్ర "వాదులు"

ద్రోహులూ......శిక్షా.....

".....ఎందుకింత రక్తదాహం....?" అంటూ ప్రశ్నించాడట--ప్రశాంతి భూషణ్!!!!!!

(వాణ్ని పార్టీలోంచి తన్ని తగిలేయడంలో మంచిపనే చేశాడు కేజ్రీవాల్ అనిపించింది. కానీ తరవాత, మెమెన్ కి ఉరిశిక్ష రద్దు చెయ్యాలని పిటిషన్ సంతకం చేసిన 40 మందిలో కేజ్రీ కూడా వున్నాడు అని తెలిసాక, వాణ్ని యెప్పుడు తన్ని తగిలేస్తారో అనిపించింది.)

వాడంటున్న రక్త దాహం యెవరికో వాడు స్పష్టంగా చెప్పలేదు. మరి యెవరికనుకోవాలి మనం? రాష్ట్ర గవర్నరుకా? రాష్ట్రపతికా? విభేదించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం లోని న్యాయ మూర్తులకా? తరువాత శిక్ష ఖరారు చేసిన త్రిసభ్య ధర్మాసనానికా? న్యాయప్రక్రియ పూర్తిగా నెరవేరాలనే వుద్దేశ్యంతో చరిత్రాత్మకంగా, తెల్లవారు జామున కోర్టు తలుపులు తెరిపించి మరీ అప్పీలు విని, వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయ మూర్తులకా? యెవరికి రక్తదాహం?

257 మందిని చంపినవాడికి, ఇంకో 758 మందిని చంపాలనిచూసి, గాయపరచి వదిలినవాడికీ ఉన్నది రక్తదాహం కాదేమో మరి వీడి దృష్టిలో!

నన్నడిగితే, ఆ సంతకాలు చేసిన 40 మంది కన్నా దేశద్రోహులు, తీవ్రవాదులూ యెవరు? వాళ్లకి, అవసరమైతే ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసైనా, దేశ బహిష్కరణ శిక్ష విధించాలి. అప్పుడుగానీ వాక్ స్వాతంత్ర్యానికి వున్న సరైన విలువ తెలియదు వాళ్లకి.

యేమంటారు?