haaram logo

Monday, August 3, 2015

న్యాయ ద్రోహులు

"లయ్యర్లూ", 'అ 'న్యాయమూర్తులూ......

మన పెద్దవాళ్లెప్పుడో చెప్పారు.....లాయర్లు అంటే లయ్యర్లు అని. ఇంకా, ఓడినవాడు కోర్టులోనే యేడిస్తే, గెలిచినవాడు ఇంటికెళ్లి యేడిచాడు అనీ, ఇంకా.....తెల్ల కోటునీ, నల్లకోటునీ ఒక సారి ఆశ్రయిస్తే జీవితాంతం వదలరు అనీ......ఇలా బోళ్లు ఛలోక్తులు!

(ఇలాంటి వాళ్లకి, గాంధీజీ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి అతి కొద్ది మందే మినహాయింపు.) 

ఇప్పటి వ్యవహారాలు చూస్తే, అవన్నీ నిజం అనిపించడం లేదూ?

ఒకప్పుడు చిన్నారుల్ని చిదిమేసిన "బిల్లా, రంగా" కేసు నుంచీ, అమ్మాయిని "తందూరీ" లో దహనం కేసు నుంచీ, పెళ్లాన్ని చంపేసిన ఓ "మంత్రి" కేసు నుంచీ, మొన్నటి "నిర్భయ" కేసు నుంచీ, "సంజయ్ దత్", "సల్మాన్" కేసులనుంచీ, "గాలి" జనర్దన రెడ్డి కేసుల నుంచి, "జగన్" కేసుల నుంచి, "జయలలిథా" ఆస్థుల కేసుల నుంచి, నిన్నటి "యాకూబ్ మెమెన్" కేసుల వరకూ మనకి కనిపిస్తున్నదేమిటి?

ఆ నేరస్థుల కి శిక్ష పడకుండా చేయాలని, పడినా యెలాగోలాగ తప్పించాలని, ఉరి శిక్ష పడ్డా, దాన్ని కొన్ని సంవత్సరాలో, నెలలో, వారాలో, రోజులో వాయిదా యేయించాలనీ, కోర్టుల్లోనూ, బయటా, నానా విన్యాసాలూ చేసి, నానా గడ్డీ కరిచి, కరిపించి, తమ కండూతి తీర్చుకుంటున్న "రామ్ జేఠ్మలానీ" లాంటి వాళ్లు అనేకమంది వున్నారు, కర్నాటక స్పెషల్ కోర్టు న్యాయమూర్తిలాంటి వాళ్లు వున్నారు......అని కాదూ?

వాళ్లకి అంత కండూతి యెందుకు? అంటే రెండే కారణాలు.....1. కోట్లలో డబ్బు ముడుతూంది, 2. కావలసినంత ప్రచారం జరిగి, అలాంటి కేసులన్నీ వాళ్లకే వెళుతున్నాయి!

మరి న్యాయం యెక్కడున్నట్టు? A I R (న్యాయాలయాల తీర్పులన్నీ ప్రచురించే పుస్తకాలు) లలో!

వాటి మీదే ఈ పరాన్న భుక్కుల జీవనం మరి!

(.......మరోసారి)

No comments:

Post a Comment