haaram logo

Sunday, March 27, 2016

"చిన్నారుల" భారతం.....5


.........నడుస్తున్న భాగోతం

(2వ భాగం చివర....."ఇంకో "చిన్నారి" ఇంకో సంచలనం సృష్టించకపోతే......!"--తరువాయి).....

రోహిత్ గొడవలో పండగ చేసుకుంటూండగానే, మీడియా వాళ్లకీ, కాంగీ కమ్మీలకీ ఇంకో కొబ్బరికాయ అందించాడు ఇంకో "చిన్నారి".....కన్నయ్య కుమార్--ఢిల్లీ జేఎన్యూ లో 2016 ఫిబ్రవరి 9 న "వామపక్ష డెమొక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్"--డీ ఎస్ యూ--తరఫున అఫ్జల్ గురు ని ఉరితీయడం పై నిరసన ప్రదర్శన నిర్వహించడం ద్వారా!

ఆ రోజు (09-02-2016) న, ఓ పదిమంది డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ మాజీ సభ్యులు, ఓ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుకుంటాం అని యూనివర్సిటీ అధికారులని అనుమతి అడిగి, కేంపస్ అంతటా పోస్టర్లు అంటించారట......ఇక్కడ ఒక కళా/ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించబడుతుంది....'కాశ్మీర్ ఆక్రమణ చరిత్ర ' పై, ఇంకా దానికి వ్యతిరేకంగా 'అక్కడి ప్రజల పోరాటం గురించీ'.....అని, అఫ్జల్ గురు; మక్బూల్ భట్ మొదలైనవాళ్ల ఫోటోలతో!

నిజంగా వాళ్లు ఉద్దేశించింది.....మూడేళ్ల క్రితం అదే తారీఖున ఉరితీయబడ్డ అఫ్జల్ గురు స్మారక సభ జరపాలని! ఆ సందర్భాన్ని, అఫ్జల్ గురు, మక్బూల్ భట్ ల "న్యాయపూర్వక హత్య" లని నిరసించడం, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారం అనే ప్రజాస్వామిక హక్కు కోసం వాళ్లు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించడం.....అని వాళ్లే చెప్పుకున్నారని, ఆ సంఘటనలతో సంబంధంలేని విద్యార్థులు చెపుతున్నారు. 

దాంతో, ఏబీవీపీ వాళ్లు ఫిర్యాదు చేయగా, యూనివర్సిటీ అధికారులు అనుమతి ఉపసం హరించారట. 

అయినా, ఆ సంస్మరణ సభ జరగనే జరిగింది. 

అక్కడ చేరిన కొంతమంది కాశ్మీరీ విద్యార్థులు, "ఈ కాశ్మీర్ మాది....పూర్తిగా మాదే", "ప్రతీ ఇంటి నుంచీ ఓ అఫ్జల్ గురు పుడతాడు", "భారత్ నాశనం అయ్యేవరకూ యుధ్ధం జరుగుతుంది....యుధ్ధం జరుగుతుంది" లాంటి నినాదాలు ఇచ్చారు. 

మీటింగ్ నిర్వాహకులు...."మనకేం కావాలి? .....స్వాతంత్ర్యం", "తీసుకు తీరుతాం ....స్వాతంత్ర్యం" లాంటి నినాదాలు ఇచ్చారు. (వీళ్లలో "చిన్నారి" కన్నయ్య కుమార్ ముఖ్యుడు). కానీ.....కన్నయ్య కాశ్మీరు విద్యార్థులు ఇచ్చిన నినాదాలు ఇవ్వలేదుట!

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ కాశ్మీర్ విద్యార్థులు అసలు జే ఎన్ యూ విద్యార్థులే కాదట. 

ఈ విషయాలన్నీ చెపుతున్నవాళ్లు.....ఆ సంఘటనలతో సంబంధం లేని విద్యార్థులే!

(......మరో సారి)

No comments:

Post a Comment