haaram logo

Thursday, March 17, 2016

"చిన్నారుల" భారతం.....3


.........నడుస్తున్న భాగోతం

అసలు రోహిత్ వ్యవహారం మొదలయ్యింది 2015 ఆగస్ట్ 3 న......తను, ఇంకో నలుగురు ఆంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులూ కలిసి, "యాకూబ్ మెమొన్" కి ఉరిశిక్ష విధించడంపై, ఇంకా "ముజఫర్ నగర్ బాకీ హై" అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తుంటే, ఏబీవీపీ వాళ్లు దాడి చేసినందుకూ! (ఆ ఐదుగురికీ కేంపస్ హీరోలు అయిపోవాలని కోరిక యెందుకు పుట్టిందో ఎవరైనా చెప్పగలరా?)

తరువాత సుశీల్ కుమర్--వాళ్లని ఫేస్ బుక్ లో "గూన్‌స్" అన్నాడని అతని మీద దాడి చేశారు రోహిత్ గాంగ్.

ఏబీవీపీ వాళ్లు ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు చేసి, వైస్ ఛాన్సెలర్ రోహిత్ నీ, నలుగురు ఇతరులనీ సస్పెండ్ చేసి, హాస్టలు ఖాళీ చెయ్యమన్నారు. తరువాత కూడా అనేక విధాల చర్చలూ, దర్యాప్తులూ జరిగాక, జనవరి 2016 లో మళ్లీ శిక్ష నిర్ధారించినందుకు.....ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపణ.....మీడియా వాళ్లదీ, కాంగీ కమ్మీలదీ.

అసలు విషయాలని ప్రక్కదారి పట్టిస్తూ, కొంతమంది మీడియావాళ్లూ, రాజకీయులూ.....వాడసలు దళితుడేకాదు అనీ, వడ్డెర కులస్తుడు అనీ, అయినా తల్లిదండ్రుల్లో యెవరి కులం కావాలో నిర్ధారించుకునే హక్కు వాడికే వుంది అనీ......అసలు ఏబీవీపీ వాళ్లు చేసిన "యూనివర్సిటీ లో రాజకీయ, కుల సంబంధ, జాతి వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి" అనే ఫిర్యాదు పై దత్తాత్రేయ చర్యతీసుకోమని మంత్రిత్వ శాఖ కి రాసినందుకూ, ఆ మంత్రి యూనివర్సిటీ వాళ్లకి తగిన చర్య తీసుకోమని రాసినందుకూ (ఆ లేఖల్లో రోహిత్ పేరూ, ఏ ఎస్ ఏ పేరూ ఎక్కడా లేకపోయినా) మాత్రమే ఆత్మహత్య జరిగింది అనీ, అది అగ్రకులాలు చేసిన హత్య అనీ.....ఇలా ఆకాశంలో దీపావళి చేసుకున్నారు!

అసలు రోహిత్ ఆత్మహత్య లేఖలో..... 

(....మరో సారి)

No comments:

Post a Comment