haaram logo

Sunday, December 18, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......4

నగదు వితరణ సమస్య.....

(మొన్నటి టపా తరువాయి)

రాష్ట్ర ప్రభుత్వం వారు, 9000 కోట్లు వస్తున్నాయి అనీ, అందులో సింహభాగం 500 నోట్లూ, చిన్న నోట్లే అనీ, క్రితం శనివారం (10-12-2016) నాటికి అన్ని బ్యాంకులకీ చేరుతాయి అనీ ప్రకటించారు. పించన్లు బ్యాంకులలో జమచేయడం పొరపాటే అనీ, బ్యాంకుల్లో జమ కాని వారికి, పాత పధ్ధతిలో, ఇంటి వద్దే చెల్లిస్తాము అని కూడా ప్రకటించారు.

ఆర్బీఐ వారు, ప్రతిరోజూ ఉదయం 9-00 కల్లా బ్యాంకుల శాఖలలో నగదు అందజేయవలసిందే--అని నగదు భాండాగారాలు నిర్వహిస్తున్న బ్యాంకులని ఆదేశించారు!

అయినా, ఈ టపా వ్రాస్తున్న రోజు--19-12-2016 వరకూ--పరిస్థితి లో మార్పు లేదు! మొన్న శనివారం అయితే, మా వూళ్లో అన్ని బ్యాంకులలోనూ, నగదు వితరణ అసలు జరగలేదు.....నగదు లేదు అనే బోర్డులనే ప్రదర్శించారు.....అంటున్నారు!

మరి......బాధ్యులు ఎవరు?

బ్యాంకుల సిబ్బంది, సెలవులు వాడుకోకుండా, రోజూ దాదాపు 10 గంటలకి పైగా పనిచేస్తున్నారు......! అని చెప్పడం--అతిశయోక్తి మాత్రమే. 

సెలవు రోజులు నవంబర్ 12, 13 న మాత్రమే పనిచేశారు. తరువాత ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ, సెలవుల్లో పనిచేయమని చెప్పలేదు.....నగదు సరఫరా పరిస్థితుల వల్ల. సిబ్బంది, సెలవు రోజులు పాటిస్తూనే ఉన్నారు, ఒత్తిడి ఎక్కువ అని భావించిన వాళ్లు, పనిదినాల్లో కూడా సెలవులు పెట్టుకుంటూనే ఉన్నారు!

శాఖలలో సిబ్బంది, ఏమి చెయ్యాలో తోచక, నగదు కోసం ఎదురు చూడడం, తెచ్చుకోవడం, 'అందరికీ' ఎంతో కొంత సరిపెట్టడం, ఆ రోజుకి మూసెయ్యడం తప్ప ఇంకేమి చేశారు?

మరి ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు? శాఖల నియంత్రణాధికారం ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులు.....'సమీక్ష ' ల తోనే గడుపుతున్నారు!

ఎవరైనా, శాఖల్లో "నగదు నిల్వల పరిమితి" ని దాటి ఉంచుకుంటున్నారా? నిల్వల్లో పాత 100 అంతకన్నా తక్కువ విలువగల నోట్లు ఎన్ని ఉన్నాయి? అని ఆరా తీశారా? (శాఖల్లో, కొత్తనోట్లు వచ్చినవి వచ్చినట్లు వితరణ మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే, అవి లెఖ్ఖపెట్టవలసిన అవసరం లేకుండా, నెంబర్లు చూసి వితరణ చేసెయ్యవచ్చు! పాతనోట్లు అయితే, లెఖ్ఖపెట్టి ఇవ్వాలి, ఎక్కువ తక్కువలు వస్తే, భరించాలి!)

అసలు, వచ్చిన నగదులో ఏటీఎం లలో పట్టగలిగినన్ని 100 నోట్లు (2000 నోట్లు స్వీకరించని మిషన్లలో) పెట్టండి, అనీ, వారానికి 24000 కు లోబడి, అడిగినంత నగదు వితరణ చేయండి.....అని ఎందుకు ఆదేశించరు?

నా ప్రశ్న ఒకటే.....ఉన్నతాధికారులు, "నగదు లేదు అని బోర్డులు పెట్టెయ్యండి" అని శాఖలకి చెప్పవచ్చా? రేపు, "మేమే ఆ ఆదేశాలు ఇచ్చాము" అని నిజాయితీగా ఒప్పుకునేవాళ్లు ఎంతమంది?

(ఇప్పుడు నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలపై చర్యలని ఎదుర్కుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నతాధికారులే!)

ఇంక, 3. ఆర్బీఐ పారదర్శకత పాటించడం లేదు--అన్నది చర్చల్లో పాల్గొంటున్న "నిపుణులు" చెప్తున్నది.

(......మరోసారి)

No comments:

Post a Comment