haaram logo

Saturday, August 1, 2015

తీవ్రవాదులు....తీవ్ర "వాదులు"

ద్రోహులూ......శిక్షా.....

".....ఎందుకింత రక్తదాహం....?" అంటూ ప్రశ్నించాడట--ప్రశాంతి భూషణ్!!!!!!

(వాణ్ని పార్టీలోంచి తన్ని తగిలేయడంలో మంచిపనే చేశాడు కేజ్రీవాల్ అనిపించింది. కానీ తరవాత, మెమెన్ కి ఉరిశిక్ష రద్దు చెయ్యాలని పిటిషన్ సంతకం చేసిన 40 మందిలో కేజ్రీ కూడా వున్నాడు అని తెలిసాక, వాణ్ని యెప్పుడు తన్ని తగిలేస్తారో అనిపించింది.)

వాడంటున్న రక్త దాహం యెవరికో వాడు స్పష్టంగా చెప్పలేదు. మరి యెవరికనుకోవాలి మనం? రాష్ట్ర గవర్నరుకా? రాష్ట్రపతికా? విభేదించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం లోని న్యాయ మూర్తులకా? తరువాత శిక్ష ఖరారు చేసిన త్రిసభ్య ధర్మాసనానికా? న్యాయప్రక్రియ పూర్తిగా నెరవేరాలనే వుద్దేశ్యంతో చరిత్రాత్మకంగా, తెల్లవారు జామున కోర్టు తలుపులు తెరిపించి మరీ అప్పీలు విని, వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయ మూర్తులకా? యెవరికి రక్తదాహం?

257 మందిని చంపినవాడికి, ఇంకో 758 మందిని చంపాలనిచూసి, గాయపరచి వదిలినవాడికీ ఉన్నది రక్తదాహం కాదేమో మరి వీడి దృష్టిలో!

నన్నడిగితే, ఆ సంతకాలు చేసిన 40 మంది కన్నా దేశద్రోహులు, తీవ్రవాదులూ యెవరు? వాళ్లకి, అవసరమైతే ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసైనా, దేశ బహిష్కరణ శిక్ష విధించాలి. అప్పుడుగానీ వాక్ స్వాతంత్ర్యానికి వున్న సరైన విలువ తెలియదు వాళ్లకి.

యేమంటారు?

1 comment: