haaram logo

Wednesday, February 26, 2014

మన ప్రభుత్వం.............


...........ఆర్థిక స్థితీ 

మొన్న (24-02-2014) ఈనాడులో ఎస్ ఎస్ తారాపోర్ (ఈయన ఒక రినౌన్‌డ్ బ్యాంకర్. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నతపదవులు నిర్వహించిన విశ్రాంతుడు. మామూలు 'బ్యాంకింగ్ రంగ నిపుణుడు' కాదు!) వ్రాసిన కొత్త సర్కారుకు "ముందు నుయ్యి - వెనుక గొయ్యి" వ్యాసం చదివితే నేను నా బ్లాగుల్లో వ్రాస్తున్న ఆర్థిక విషయాలు (బ్యాంకులూ, ఇన్‌ఫ్లేషన్‌ వగైరాలు) యెంత నిజాలో మీకూ తెలుస్తుంది. ఈ క్రింది విషయాలు గమనించండి.

".........2013-14 కు సవరించిన అంచనాల ప్రకారం  కేంద్రానికి వివిధ ప్రభుత్వ  రంగ సంస్థల నుంచి లాభాలు, డివిడెండ్ రూపం లో వచ్చిన మొత్తం 2012-13 లో వాస్తవంగా ఇలా అందిన మొత్తం కన్నా 64 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఏమనిపిస్తోంది. ప్రభుత్వం తాను గీసుకున్న లక్ష్మణరేఖ (ద్రవ్య లోటును జీడీపీలో 4.8 శాతం లోపు ఉండేలా చూడడం) దాటాల్సిన అవసరం లేకుండా పోయింది. అర్థ్హం చేసుకుంటే ఇదంతా లెక్కల గిమ్మిక్కు మహత్యమేనని తెలియదూ!"

".........మొన్నటి మధ్యంతర బడ్జెట్లో.........ముఖ్యంగా వాహన పరిశ్రమకు ఊరట లభించింది. అయితే పెద్ద కార్ల విషయం లో గణనీయంగా తగ్గింపు ప్రకటించడం రాజకీయ ఒత్తిళ్లు ఎంతగా పనిచేశాయన్నదానికి అద్దం పడుతోంది..................సామాన్యుడికి మాత్రం ఒరిగేది ఏమీ లేదనే చెప్పుకోవాలి."  

"ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం రూపం లో రూ.11,200 కోట్లు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి...........బ్యాంకుల స్వరూప స్వభావాలు జాతీయకరణ సమయం లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. గత 45 యేళ్లలో బ్యాంకుల చరిత్ర తిరగేస్తే.....జబ్బుపడ్డ గుర్రాలకు రక్తమార్పిడి చేయడం, స్టెరాయిడ్లు ఎక్కించడం ద్వారా వాటిని పందెం గుర్రాలుగా తీర్చిదిద్దుతున్న ప్రయత్నం కనిపిస్తుంది...........జబ్బు తిరగబెట్టి మళ్లీ మళ్లీ.......మూలధన సాయం అవసరమౌతూ........మళ్లీ చతికిలపడిపోతూ......... చివరకు......నిలదొక్కుకోలేని విధానాల తాలూకు భారాన్ని మోయవలసింది మాత్రం సగటు వ్యక్తేనన్నది తోసిపుచ్చలేని వాస్తవం."    

"............ప్రధాన పారిశ్రామిక దేశాలతోపాటు భారత్ లోనూ ద్రవ్యోల్బణ రేటు పెరుగుతూ వస్తోంది...........రూపాయి విలువ పడిపోవడం అత్యంత సహజం. కానీ, మన రాజకీయవేత్తలు ఊరుకోరుగా...అరచి గగ్గోలు చేస్తారు..........ఆర్ బీ ఐ సరైన లక్ష్యాలనే నిర్దేశించింది.........ఆర్థిక మంత్రి మరింత బలపరచడమో, లేదా కనీసం సమర్ధించడమో చేయాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ.........ప్రభుత్వా వైఖరి.....ఆర్ బీ ఐ..........కఠినతర ద్రవ్య విధానాలని వదలి వేసేటట్లుగా........ఒత్తిడిని పెంచనుంది........ప్రముఖ ఆర్థికవేత్త ఆచార్య పి.ఆర్.బ్రహ్మానందం మాటలలో చెప్పాలంటే 'ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకపోవడం ప్రాణాలు వదలిన, తీవ్రగాయాలతో మరణానికి దగ్గరగా ఉన్న, క్షతగాత్రులైన వారిని గురించి పట్టించుకోకుండా సమరానికి వెళ్ళడం లాంటిదే'. రానున్న నెలల్లో సామాన్యుడికి మరింత వేదనే మిగలనుంది."

వచ్చే ప్రభుత్వం తప్పులని సవరించి, సామాన్యుడికి న్యాయం చేస్తుందని ఆశిద్దాం.

No comments:

Post a Comment